పోస్ట్‌లు

జులై, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

తెలుగు టైపింగులో మెళకువలు

చిత్రం
ముందుగా తెలుగు కీబోర్డులో అక్షరాలు ఎలా అమర్చబడ్డాయో చూద్దాం. తెలుగు అక్షరమాల పెద్దది కనుక అచ్చులూ, హల్లులూ, గుణింతాలూ అన్నింటినీ రెండు బోర్డులలో కూర్చారు. మొదటిబోర్డులో అచ్చులూ, కఠిన హల్లులూ ఉన్నాయి. రెండో బోర్డులో గుడింతాలూ, సరళ హల్లులూ ఉన్నాయి. వాటి వివరాలలోకి వెళదాం. మొదటి బోర్డులో ఎడంవైపు అచ్చులన్నీ ఉంటాయి. కుడివైపు కఠిన హల్లులూ.  పై చిత్రం చూస్తే ఇలా తెలుస్తుంది. అ,ఇ, ఉ అచ్చుల దీర్ఘాలు సరిగ్గా వాటిపైనే ఉన్నాయి. అలాగే ఎ,ఏ,ఐ,ఒఓ,ఔ లు కూడా. ఇక హల్లులకు వద్దాం, క్రింది చిత్రం చూడండి. హల్లులలో ఒక అక్షరక్రమం లేకున్నా క,చ,ట,త, ప లు ఒక దగ్గరగా ఉన్నాయి. వాటికి పైగా గ,జ,డ,ద,బ లున్నాయ్. క్రింద య,ర,ల,వ, స లున్నాయ్. ఇవన్నీ సరళంగా పలికే హల్లులు. ఒక్కొక్క సరళహల్లుకూ కఠిన హల్లు అదే స్థానంలో రెండో బోర్డులో ఉన్నాయ్. ఎలాగంటే క-ఖ, చ-ఛ, ట-ఠ,.... వగైరా. క్రింద చిత్రం చూడండి: రెండో కీ బోర్డులో ఎడం వైపు గుణింతాలుంటాయి - పై చిత్రంలో ర-గుణింతాలున్నాయి ఉదాహరణగా. అవే గుణింతాలు అన్ని హల్లులకు పనికొస్తాయి.  రెండో కీబోర్డులో కుడివైపు కొన్ని హల్లులుంటాయి

స్తోత్రపఠనం

నవ విధ భక్తిలో పూజనము విశేష స్థానము కలిగినది. దేవుని ఆరాధించే సులువైన మార్గము. అనేక భక్తులు వీలైనప్పుడు / కొందరు ప్రతి దినమూ దేవతార్చన చేస్తూంటారు. మన సనాతన శాస్త్రములైన పురాణములలో అనేక స్తోత్రములు, అష్టోత్తరాలూ, సహస్రనామాలు ఉన్నాయి. ప్రతి స్తోత్రానికి ఉపోద్ఘాతము, స్తోత్రమూ, ఫలశ్రుతి  ఉంటాయి.  సంస్కృత భాష భారతీయుల సంస్కృతిలో, జీవనములోనూ భాగమై ఉంది. వేదాలూ, ఉపనిషత్తులూ, పురాణాలూ, ఇతిహాసాలూ, సంహితలూ మొదలగనవి అన్నీ సంస్కృతములో లిఖించబడి భారతీయ వాజ్మయముతో పెనవేసుకుపోయాయి. ఈ శాస్త్రాల పట్ల భారతీయులకు పవిత్రమైన భావనే కాక ఆరాధనా భావను కూడా ఉన్నాయి. చిన్నప్పటినుంటి ఈ శాస్త్రాలను, వాటిలోని చిన్న భాగాలనైనా వింటూ భారతీయులు పెరిగారు. మాతృభాష సంస్కృతము కాకపోయినా సంస్కృతములో ప్రవేశము లేకపోయినా సంస్కృత మంత్రాలను, శ్లోకాలను విన్న వెంటనే ప్రతి భారతీయుడు పవిత్రమైన భావానికి లోనవుతాడు. ఈ నేపథ్యంలో శ్రద్ధ కలిగిన భక్తులు దేవతార్చన చేయునప్పుడు సంస్కృతములోని శ్లోకాలూ, మంత్రాలూ పూర్తిగా అర్థము కాకపోయినా అర్చనానంతరము మానసికంగా ఉత్తేజితుడవుతాడు. దీనికి కారణం సంస్కృత భాషయొక్క శబ్దమాధుర్యము, ఉచ్చారణా ప్రభ...