అలౌకికం-లౌకికం
లౌకికం =1, అలౌకికం=0 అనుకుంటే,
(అ) లౌకికాన్ని తగిలించుకుంటూ……….పోతే….
ఎంత = 0+1+1 +1+ +1+ +1+ +1+ +1+ +1+…..
= 0 +1+(1 +1)+(+1+ +1+ +1)+(+1+…..
= 0 +1++2+3+4+5+6+7+8+9+10…
= ఎంతో………………………….(అనంతం)
లౌకికమనేది లంపటం, ఒకదాని తరవాత ఒకటి తగులుతూనే ఉంటుంది అనంతంగా, ఎప్పటికి లెక్కతేలదు, ఒక దరికిరాదు. లౌకకంలో తగులుకున్న మానవుడు లౌకి గానే ఉండిపోతాడు, అలౌకికం పెరగదు. చదువు, పెళ్లి, పిల్లలూ, ఉద్యోగం, పిల్లల పెళ్ళి…….. వలయం తిరుగుతూనే ఉంటుంది.
(ఆ) అలౌకికాన్ని తగిలించుకుంటూ……….పోతే
ఎంత =1+0+0+0+0+0+0+0+0+0+0+0+……
= 1 (ఎంతో అంతే)
అలౌకికమనేది ఎంత తగిలించుకున్నా పరవాలేదు, లౌకికం పెరగదు. లౌకికమైన పనులు పెరగవు (బరువనిపించవు), కానీ లౌకికమైన బాధ్యతలు ఉంటూనే ఉంటాయి కదా …చదువు, పెళ్లి…వగైరాలు) బాధించవు
‘ఇదంతా లెక్కల గారడీ, అలౌకికం=0, లౌకికం=1 అనే ఎందుకు తీసుకోవాలి, చెప్పాలనుకున్నది చూపించటానికా, వేరేవిలువలు తీసుకోవచ్చును కదా’ అంటావా?
లౌకికం (లోకం అన్న పదానికి పర్యాయం) మనకు కనపడేది, అందుకని కనపడేవి అంకెలలో చెప్పటానికి 1 తీసుకున్నాను,2,3,4…లలో ఏది తీసుకున్నా, ఒకే - అదే నిరూపణ అవుతుంది.
‘అయితే పరం (అలౌకికం) సత్యం, జగన్మిథ్య (లౌకికం) అంటారు కదా, మరి లౌకికం=0 (మిథ్య అంటే ఏమీలేదు కనుకశూన్యం.., కనుక 0), అలౌకికం = 1 (సత్యం, అంటే ఉంది…అంటే 1,2,3 ఏదో ఒకటి) తీసుకోవచ్చును కదా..’ అంటావా? భేష్…ఇదింకా మంచి ప్రతిపాదన (హైపాథిసిస్). ముందు కెళ్ళేలోపు ఒక విషయం.
‘పరం సత్యం, జగన్మిథ్య’ అనేది అలౌకిక దృష్టి, నువ్వు ప్రతిపాదించిన (అలౌకికం = 1, లౌకికం = 0) విధంగా విలువలు తీసుకున్నట్లే, ఫలితాలు కూడా అలౌకిక దృష్టిలో నిర్వచించాలి, దీనికి నువ్వు ఒప్పుకోవాలి. నీ వాదనా, నా వాదనా ఒకే భూమిక పైఉండటం సరి న్యాయం కదా.
పైన ఇచ్చిన రెండు ‘ఎంత’ అన్న సమీకరణాలే వాడుకోవచ్చును. ‘అ’, ‘ఆ’ లు తిరిగి ఇలా వ్రాయాలి, కానీ వాటి ఫలితాలు పైన వలే ఉంటాయి, కానీ తారుమారు అవుతాయి. లెక్కల పద్థతి మారదు, ఫలితాలు మాత్రం అలౌకిక దృష్టిలో చూడాలి -అది ఇప్పుడే అంగీకరించాం)
అ) అలౌకికాన్ని తగిలించుకుంటూ……….పోతే
0+1+1+1+1+1+1+1+1+1+1+1+1+1+1+1+……….. ఎంత?
+1++2+3+4+5+6+7+8+9+10……?
ఎంత= ఎంతో…….(అనంతం) అని తెలుసుకున్నాం కదా. అంటే అలౌకికాన్ని తగిలించుకున్న కొద్దీ తగులుకుంటూనేఉంటుంది. అలౌకికం అనంతం. “పరం సత్యం” అంటే అలౌకిక దృష్టిలో దాని అర్ధం పరమాత్మ అనంతం, అన్నింటా ఉన్నాడు, అందరిలోఉన్నాడు, అన్ని కర్మలలో (పనులలో) అలౌకికభావం పెంచుకు(తగులుకోవటం) పోవటం ‘సమర్పణ’ భావం.
(ఆ) లౌకికాన్ని తగిలించుకుంటూ……….పోతే
ఎంత= 1 (ఎంతో అంతే)
ఇక్కడ అలౌకిక దృష్టిలో 1 అన్నది ‘పరం సత్యం’ అని సూచించినది కనుక, ‘జగన్మిథ్య’ అన్న భావనతోనే కర్మలు చేస్తూపోవాలి, ఫలితం ‘పరం సత్యం’ అన్న భావన మిగులుతుంది, బలపడుతుంది.
కనక ఏ విధంగా చూసిన పరమాత్మ (కు అంకిత భావంతో కర్మలు సమర్పిస్తూ) వైపుకు ప్రయాణిస్తూ ఉంటే మనబాధ్యతలు బరువు ( ఆయన తేలిక పరుస్తాడు కనుక) అనిపించవు-పైగా అవే లౌకిక బాధ్యతలు ఆనందాన్నిస్తాయి.
దీనికి వయస్సుతో సంబంధం లేదు. భావన ముఖ్యం. ముందు భావన రావాలి, సాధన పెరుగుతూంటూంది. పెరుగుతున్న సాధన భావాన్ని మరీ బలీయం చేస్తుంది
భావన —->>>సాధన
సాధన ——>>>భావన
భావన —->>>సాధన
సాధన ——>>>భావన
భావన —->>>సాధన
సాధన ——>>>భావన
……….
………..
అదొక చక్రం లా సాగి భావన, సాధన పరస్పరం బలపడతాయి, పెరుగుతాయి..!!!
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి