శాక్తేయం-అర్చన
అమ్మ(వారే) పరబ్రహ్మమని నమ్మేవారి మతం - శ్రీవిద్య, శ్రీచక్రవిద్య, షట్చక్రవిద్య - శాక్తేయంలో బ్రహ్మవిద్యలు.
ప్రతి మనిషి వెన్నెముక ద్వారా శక్తి (అమ్మ) పైకి ప్రవహించి నెత్తి నడి మధ్యన (సహస్రారంలో) అయ్య(పరబ్రహ్మాన్ని) కలుస్తుంది ఏ కోటిలో ఒకరికి. కానీ అందరిలో భగవంతుడుని విష్ణువైనా, శివుడైనా, బ్రహ్మైనా, గణపతైనా, లక్ష్మైనా,....) నమ్మే వారికి ఆ శక్తి కొద్దోగొప్పో పైకి ప్రవహించటము మొదలవుతుంది. అది (ఆ ప్రవాహం) నిలబడటానికి మన పూర్వీకులు ‘పంచోపచార’ అర్చన బోధించారు-ఇంటా,కోవెలలో(బయటా). షట్కచక్రాలలో 5 పంచభూతాలే, మనం లోపలా, బయట చూడగలిగేవి.
పంచ భూతం - చక్రం పేరు-మనిషిలో
ఆకాశం. -విశుద్ధం. - కంఠం
వాయువు. - అనాహతం. -ఛాతిమధ్య
అగ్ని. - మణిపురం. - నాభి
జలం(నీరు). స్వాధిష్టానం - నాభి/పీఠం
భూమి(పదార్ధం). -మూలాధారం-పీఠం
అందుకుని అర్చనల్లో విధిగా పంచభూత సంబంధమైన విధులు కూర్చారు.
మంత్రము (శబ్దం - ఆకాశము)
గంథం (వాయువు)
హారతి (అగ్ని)
తీర్థం (జలం)
ప్రసాదము -పదార్థం (భూమి)
సాధనాంశమేంటి? ఈ 5 విధివిధానలు భక్తునిపై ప్రభావము చూపి, భక్తునిలో శక్తిని పైకి ప్రసరింపచేస్తుందేమో!!!
ఈ 5 చక్రాలపైన ఉండేదే ‘ఆజ్ఞా’ చక్రం. అది కేవలం ప్రాణాయామ సంయుత ధ్యానము ద్వారానే చేర సాధ్యం.
దాని పైన ఉండే సహస్రారం దాదాపు అసాధ్యం, కేవలం పైవాడి దయే!!
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి