త్రిమతాల భేదం
ద్వైత, అద్వైత, విశిష్టాద్వైతాల ప్రధాన భేదానికి స్పష్టసూచిక
శ్రీరాముడు ఒకసారి హనుమంతుని ప్రశ్నించాడట, కపీశ్వరుని సమాధానంలో ఆయన పాండిత్యమే కాక ఆత్మజ్ఞానమూ, సూక్ష్మగ్రాహ్యత కనపడతాయి. ఆ సమాధానమే ఇది:
దేహబుధ్యా తు దాసోఽహం జీవబుధ్యా త్వదంశకః
ఆత్మబుధ్యా త్వమేవాహమ్ ఇతిమే నిశ్చితా మతిః
దేహబుద్ధితో చూస్తే నీకు దాసుడను (నువ్వూ, నేనూ వేరు అన్న ద్వైతం- ప్రకృతి), జీవబుద్ధితో చూస్తే నీ అంశను (జీవాత్మ - జీవమున్న ఆత్మ - ఆత్మ, ప్రకృతి విడిగా చూడ కలిగే విశిష్టాద్వైతము) ఆత్మబుద్ధి పరంగా నేను నువ్వే (నువ్వూ, నేనూ ఒకటే అన్న అద్వైతము - రెండు కానిది).
ఈ మూడు మతాలూ వేదస్థమైన అంశాలు, కొత్తగా పుట్టినవి కావు. కానీ ఈ పేర్లతో బహుళంగా, స్పష్టతతో ప్రచారములోకి వచ్చినది మాత్రము ముగ్గురి మార్గదర్శకుల వల్లన:
ద్వైతమతము - శ్రీ మర్ధ్వాచార్యులు (మాధవాచార్యులు, ఈయన్నే శయనాచార్యులనీ అంటారు, మతాన్ని ఆచరించే వారిని మర్దవులు అంటారు)
విశిష్టాద్వైతం - శ్రీ రామానుజాచార్యుల వారు
అద్వైతమతం - శ్రీ శంకరాచార్యుల వారు
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి